Thursday 1 July 2010

అభినందనీయం

ఇంధనధరలపై  ప్రభుత్వ నియంత్రణ ఎత్తివేత అని అనగానే సామాన్యుడుపై పెట్రోబాంబు అని ఒకరు, సామాన్యుడి నడ్డివిరిచిన ప్రభుత్వం అని మరొకరు, నట్టింటపేలిన సిలండర్ అని ఇంకొకరు దుమ్మెత్తి పోస్తూనేఉన్నారు.. ఇంకోపక్క ఊసరవెల్లి రాజకీయపక్షాలు బందుకి పిలుపునిచ్చాయి......

నిజంగా కేంద్ర ప్రభుత్వం చేసింది అంత పెద్ద తప్పా ??  ఏమో నాకు మాత్రం ఇవి కాస్త అర్ధవంతమైన సంస్కరణలుగా కనిపిస్తున్నాయి.....అయినా వేల రూపాయలు పొసి ద్విచక్ర వాహనం, లక్షలు సమర్పించి నాలుగు చక్రాల వాహనం కొనుగోలు చెసేవారికి ఇది నిజంగా భారమా....కానే కాదు అని నా గట్టి నమ్మకం....ఒకవేల నిజంగా అది మనకి భారమైతే అది పర్యావరణానికి చాల మేలు చెస్తుంది :) కానీ ఈ ధరల పెరుగుదలవలన నిరుపేదల జీవితాలపై పరోక్షంగా ప్రభావం పడుతుంది అన్నది ఎవరూ కాదనలేని వాస్తవం ....బహుశా ప్రభుత్వం ఈ దిశగా అలోచన చేసి ఈ ధరల పెరుగుదల ప్రభావం ప్రజా రవాణా వ్యవస్థ మీద నిత్యావసరాల సరఫరా మీద లేకుండా చేస్తే ఈ సంస్కరణలకు మానవీయకొణం జొడించినట్లవుతుంది.

ఇక వంట గ్యాస్ విషయానికివస్తే నిజంగా ఇందులో ప్రభుత్వం ఇస్తున్న 200 రూపాయల రాయితీ ఎంతమందికి అవసరం..ఈ రాయితీ లేకపొతే ఎంతమంది దీనిని కొనలేక వాడకానికి దూరం అవుతారు...బహుశా ఇప్పుడున్న వినియొగదారులలో కొద్దిమంది మాత్రమే ఈ అవసరం ఉండి ఉంటుంది.....ఎందుకంటే ఇది ఇంకా చాలామంది భారతీయులకు అందని ద్రాక్షే   ఇక నిరుపేద ఇంట్లో దీపం వెలిగించే కిరోసిన్ మీద పెంపును నేను కూడా కాస్తా జీర్ణం చెసుకోలేకపోయను...కాని కాస్తా ఊరట కలిగించే విషయం ఏమిటంటే వీటి ధరల వ్యవస్థను ప్రభుత్వం తన గుప్పెట్లోనే ఉంచుకుంది  మన పక్క దేశాలతో పోల్చి చూస్తే ఈ పేదవాడి వంటగ్యాస్ మీద ప్రభుత్వం చాలా రాయితీ ఇస్తుంది ( బంగ్లాదేశ్, పాకిస్తాన్ మరియు నేపాల్లో  30 రూపాయలు పైన, శ్రీలంకలో 21 రూపాయలు) ... అయినా ప్రభుత్వం వంటగ్యాస్, కిరోసిన్ విషయంలో కాస్తా సరళంగా వ్యవహరించి వుండి ఉండాల్సింది..ఇప్పుడు ఇస్తున్న రాయితీలకు ఎగువ మధ్యతరగతి మరియు సంపన్న కుటుంబాలను దూరంచేసి పేదవాడికి, మధ్యతరగతికి మరింత భారం కాకుండా చూడవలసిన గురుతరమైన బాధ్యత ప్రభుత్వానిదే  

స్థూలంగా చూస్తే ఇవి చాలా అవసరమైన సంస్కరణలు ...అర్హులుకి, అనర్హులకి అందరికీ రాయితీల పేరిట ప్రభుత్వం లక్షల కొట్ల రూపాయల భారం మోయడం అర్ధరహితం. దేశ ఆర్ధిక వ్యవస్థని పట్టాలు తప్పించే ప్రజాకర్షక విధానాలను ఎన్నికల దృష్టితో చూడకుండా కొంతవరకు వాటికి స్వస్తి పలకడం నిజంగా అభినందనీయం..ఇలాంటి చేదు గులికలకు మద్దతునివ్వడం మనందరి భాద్యత కూడా !!!!!!!!!

Monday 7 June 2010

పర్యావరణం

ఏ ఏటికాయేడు పెరిగిపోతున్న ఎండలు.... అకాల వర్షాలూ...గతితప్పిన ఋతుపవనాలు....కరువు కాటకాలు....కొత్త రోగాలు...........సమస్య రూపాలే వేరు కానీ అన్నింటికీ మూలం మాత్రం మనమే..నిజంగా నిజం ...ఈ ప్రకృతికి ఈ విళయతాండవం నేర్పింది మనం


మరింత సుఖవంతమయన జీవితం అనే స్వార్ధ తలంపుతో మారిన లేక మారుతున్న మన జీవనశైలి  నేడు ఈ భూగోళం మీద ఉన్న కొన్ని రకాల జీవచరాలకు పెనుశాపంగా పరిణమించింది. అది మరింతగా రూపాంతరంచెంది మనల్ని కబళించకముందే మనం నిద్రలేవాల్సిన అవసరం ఉంది... ఇది మనందరి బాధ్యత...పర్యావరణ దినోత్సవం (5 జూన్) సందర్భంగా మన బాధ్యతలను ఒక్కసారి గుర్తుచెసుకుందాము అన్నదే ఈ నా టపా ఉద్దేశ్యం     


ఒక్క నిమిషం విద్యుత్ లేకపొతే ఆపసోపాలు పడే మనం దాని విలువను నిజంగా గుర్తించలేకపొతున్నాం.. మనకి ఆ విలువే తెలిసుంటే మన ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యాలయాలలో బహుశా విద్యుత్ వృధా అయ్యెది కాదేమో...మనుష్యులు లేకపొయిన వెలిగే విద్యుత్  దీపాలు, గోడలను చల్లబరచడానికి  తిరిగే ఫంకాలు, విశ్రాంతి అంతే ఎంటో తెలియని కంప్యూటర్ స్క్రీన్స్ చెప్పకనే చెబుతాయి మనకి విద్యుత్ పొదుపు మీద పర్యావరణం మీదా ఉన్న శ్రద్ధని..  విద్యుత్ పొదుపు అంటే కేవలం డబ్బు పొదుపు కాదు అని మనం మరవకూడని విషయం... విద్యుత్ ఆదా చెస్తే దాని ఉత్పత్తిలో వాడే బొగ్గుని, నీటిని, ఇంధనాన్ని  తద్వారా కాలుష్య ఉద్గారాలను తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించుకొలేమా...  


వాహనాలలోకి ఇంధనం నింపుకొనేటప్పుడు ఒక్కచుక్క ఇంధనం కిందపడితే నానా యాగి చేసేవాల్లు  లేదా అయ్యయ్యో అని బాధపడేవారు మనలో కొకొల్లలు..కానీ అదే పాత్రల కొలది నీరు వృధా అవుతున్నా మనలో చాలామందికి కనీసం చలనం ఉండదు..కానీ మనం ఎల్లప్పుడు గుర్తు పెట్టుకోవలసిన విషయం నీటిని సంరక్షిస్తే భూగర్భ జలాలను రక్షించుకోవడంతో పాటుగా, ఆ నీటిని తొడేందుకు అయ్యే విద్యుత్ ఆదా తద్వారా పర్యావరణ పరిరక్షణ అని 


శిలాజ ఇంధణాల విచ్చలవిడి వినియోగం వలన వాతావరణంలోకి విడుదల అవుతున్న విష ఉద్గారాలవలన పర్యావరణం మీదపదుతున్న ప్రభావం ఇంతా అంత కాదు....దీనికి తోడు మన ఆరోగ్యం మీద ఇవి చూపించే ప్రభావం మన తప్పులకు బోనస్....నేడు మోటార్ వాహనాల వినియోగం చూస్తే నాకు కర్ణుడు గుర్తుకు వస్తాడు, ఆయన కవచకుండలాలతో పుట్టినట్టు మనలో చాలా మంది మోటార్ వాహనంతో పుట్టమా అని అనిపిస్తుంది. తుమ్మడానికి, దగ్గడానికి కూడా వాహనంవాడే వాల్లు మనలో చాలామంది ఉన్నారంటే పెద్ద అతిశయోక్తి కాదేమో. వారంలో కనీసం ఒకరోజు ప్రజారవాణా వ్యవస్థ వాడడం, సైకిల్ వంటి కాలుష్యరహిత వాహనాలను వాడడం ద్వారా కొంత వరకు మనం ప్రకృతితో సహజీవనన్ని క్షేమంగా కొనసాగించవచ్చు


మన జీవనశైలిలో ప్రక్రృతిపైకి కత్తి దూస్తున్న మరో మన అలవాటు ప్లాస్టిక్ వినియోగం.. శాస్త్రవేత్తలు మరియు పర్యావరణవేత్తలు ఎంత నెత్తీ నొరు బాదుకుంటున్న, చెవిటివాడిముందు శంఖం ఊదినట్టుగా తయారయింది మన చందం. ఈ ప్లాస్టిక్ వ్యర్ధాలు మట్టిలో కలవడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది అన్న నిజం మనలో చాల మందికి తెలిసిన, అదంతా దున్నపొతు మీద వర్షం కురిసినట్టే...ప్లాస్టిక్ కి ఎన్నొ ప్రత్యామ్నాయాలు ఉన్నాయి వాటి వైపు మరలాల్సిన అవసరం ఇప్పటికైనా చాలా వుంది....


ఇలా చెప్పుకుంటూ పొతే కొకొల్లలు ...అందుకే మన దైనందిన జీవితంలో వాడె ప్రతీ వస్తువుని మనం పర్యావరణం దృష్టితో వాడవలసిన అవసరం ఎంతైనా ఉంది అది మనం వ్రాయడానికి  వాడుకొనే కాగితం ఐనా లేక ఇతర అవసరాలకు వాడే టిష్యూ పేపర్ ఐనా. చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లలకి ఆస్తిపాస్తులు ఇవ్వడం మాత్రమే వారి బాధ్యత అనుకుంటారు.. కాని డబ్బు ఒకటే వారి బంగరు భవితకు బాటలు వేస్తుంది అనుకుంటే అది ఖచ్చితంగా వారి అమాయకత్యం అవుతుంది ..ఎందుకంటే మనం మారితేనే రేపటి తరానికి మనుగడ..

Monday 12 April 2010

నరమేధం

స్వతంత్ర భారతదేశచరిత్రలో ఒక నెత్తుటి పుట...చెరిగిపోని అతి పెద్ద నెత్తుటి మరక


ప్రజల మౌళిక సమస్యల పరిష్కారమే ధ్యేయమని చెప్పుకొని ప్రారంభమైన ఒక ఉద్యమం(?), కాలం చెల్లిన సిద్ధాంతాలతో పూర్తిగా ప్రక్కతోవ పట్టి, కేవలం తమ అస్తిత్వం నిరూపించుకోవడానికి పచ్చని అడవులలో నెత్తుటేరులు పారిస్తుంది..నిన్నటి బలిమెల సంఘటణలో 36 మంది జవాన్లు మరణించారు అన్నది మన స్మృతిపధంలోంచి చెరగకముందే నేడు చత్తీస్‌ఘర్‌లో 76 మందిని పొట్టన పెట్టుకున్న నెత్తుటి ఉద్యమంపై ఓ సామాన్యుడి హృదయ వేదనకి అక్షరరూపం ఈ నా టపా...


ఆన్నా(??)

బహుశా మీరు విజయదరహాసంతో(?) ఉండిఉంటారు..పై చేయి సాధించాం అనే భ్రమలో ఆనందపడుతూ ఉండి ఉంటారు ...అందుకే మీకు కొన్ని విషయాలను గుర్తు చేయదలచాను...


ఒక్కసారి గుర్తుతెచ్చుకోండి..ప్రజా జీవితాలకు దూరంగా ఉండి మీరు గత 30, 40 సంవత్సరాలలో ఏమి సాధించారో..ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం, పోలీసులు, రాజకీయ నాయకులు ప్రాణాలు తీయడం తప్ప...ప్రభుత్వ ఆస్తులు అంటే ప్రజల ఆస్తులు అని మరచిన మీరా ప్రజలకు మేలు చేయగలిగేది!!!!!! బహుశా మీవలన బాగుపడ్డ కుటుంబాలుకంటే...ఇలా మీ దాడులతో నాశనమైన కుటుంబాలే ఎక్కువేమో.

పంటికి పన్ను, కంటికి కన్ను అన్నదే అందరి సిద్ధాంతం ఐతే, గుర్తుంచుకోండి ప్రపంచం ఎప్పుదో గుడ్డిదైపోయేది. అయినా మీరు పొరపాటు చెస్తే దానికి పరిహారం ఒక క్షమాపణ(దేవరకొండ ప్రజాప్రతినిధి రాగ్యా నాయక్ విషయంలో మీ క్షమాపణ అతని ప్రాణాలను తిరిగి ఇవ్వలేకపొయింది అని మీరు మరిచి ఉండొచ్చు కాని ప్రజలు మరవలేదు ), అదే అవతల వాదు చేస్తే దాని ఖరీదు వాడి ప్రాణం..


మీకు కాస్తా వయసు మీద పడితేనో లేక కాస్తా సుస్తీ చేస్తోనో లేక మిమ్మలని అడవులలో పోలీస్ బలగాలు చుట్టుముడితే అప్పటి వరకు మీరు మీ వర్గశత్రువు అనుకొని పొరాడిన ప్రభుత్వాన్ని నిస్సిగ్గుగా క్షమాభిక్ష అడగడం కడు ఆశ్చర్యం కలిగించే విషయం..కాని దీని బట్టి ఒక విషయం సుస్పస్టం... మీకు మీ ప్రాణాలు అంటే తీపి అవతలవారి జీవితాలు అంటే మాత్రం విరక్తి....వినడానికి విడ్డూరంగా ఉన్నా ...ఇది మీరు గుర్తుంచుకొవలసిన వాస్తవం...


మీరు కనీస మానవీయ విలువలను గాలికి వదిలేసి, ఏ మాత్రం లొకజ్ఞానం తెలియని పసివారిని ఉద్యమం(?) అనే ఊబిలోకి లాగివారి బాల్యాన్ని చిదిమివేయడం ఏ న్యాయం..ఎవరైనా మీకు వ్యతిరేకంగా పనిచేస్తే, మరుక్షణం ఇన్‌ఫార్మర్ అనే నెపంతో వాడి ప్రాణాలను గాలిలో కలిపెయ్యడం, ఆ కుటుంబాన్ని వీధిన పడెయ్యడం మీకు వెన్నతో పెట్టిన విద్య..మీరు మీ ఉద్యమంలో సామాన్యులని సమిధులగా వాడుకొని వారి జీవితాలను దుర్భరం చేస్తున్నారు అన్నది కాదనలేని కఠోరమైన నిజం..బహుసా మీ కన్న నియంతలు నయమేమో


నన్ను చాలకాలంగా ఒక సందేహం పట్టి పీడిస్తుంది మీ పొరాటం(?) గురించి... ఏముంది మీకు, సరిహద్దు ఆవల వున్నవారికి తేడా..???!!!!
వారు పరాయి దేశస్తులను చంపుతుంటే మీరు ఒకరికి మేలు చేస్తున్నాం అనే భ్రమలో అమాయక సోదరులను లేక విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యొగులను పొట్టన పెట్టుకోవడం తప్ప...


అందుకే ఒక్కసారి ఆలోచించండి...తుపాకి గొట్టంతో రాజ్యాధికారం సాధిస్తాం అని అనుకోవడానికి ఇది నేపాల్ వంటి కుగ్రామం కాదు..ఇక్కడున్నది రాజరికం అంతకన్నా కాదు.. అయినా 120 కోట్లమంది నమ్ముతున్న భారత రాజ్యాంగవ్యవస్థను మీరు ఎందుకు నమ్మలేకపొతున్నారు.. 30, 40 యేళ్ళనాటి పరిస్థితులువేరు..ఇప్పుడు పరిస్థితి వేరు.. ఇంకా మారాల్సి ఉన్నప్పటకి, ప్రజల జీవనప్రమాణాలలో చాలా మార్పు వచ్చింది..కానీ ఖచ్చితంగా మారాల్సింది మాత్రం మీ కాలం చెల్లిన సిద్ధాంతాలు ....


ఒక్క క్షణం ఆత్మపరిశీలనకై వెచ్చించండి మీలో ఎంతమందికి భావసారూప్యత వుంది...మీలో ఎంతమందికి మీ సిధ్ధాంతాల మీద అవగాహన వుంది ...చాలమంది ఏదో భావావేశంలో ఉద్యమంలో చేరిన వారే...ఆన్యాయం జరిగిందని ప్రతీఒక్కరు పగ, ప్రతీకారాలతో రగిలిపొతే మిగిలేది ఎముకల గూడు మాత్రమే ...ఎందుకంటే ప్రతీ మనిషి ఎదొ ఒక స్థాయిలో ఎలానోఒకలా దగా పడే వుంటాడు..


ఒక్కమనవి...చంపాల్సింది వ్యక్తులను కాదు ...ముందు మీ బూజు పట్టిన సిద్ధాంతాలను తరువాత ఏలికల సిద్ధాంతాలను...మీరు ఎక్కడో కొండలలో ఉండి ఆటవిక న్యాయంని నమ్మేబదులు...ప్రజాజీవితంలో ఉండి నిర్మాణాత్మకమైన పద్ధతిలో ప్రజాచైతన్యం ద్వారా సమాజమలో మార్పు తీసుకురాగలిగితే ప్రతీ సగటు భారతీయుడి కలల సమాజం వాస్తవరూపం దాలుస్తుంది


ఇట్లు,
ఓ సామాన్యుడు..

Saturday 6 March 2010

నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం

ఎయిడ్స్....కేవలం మూడు అక్షరాలు ...పదమే చిన్నది... ప్రతాపం కాదు ఎందుకంటే అదో ప్రాణాంతక వ్యాధి..

నేడు దేశాన్ని అందునా మన రాష్ట్రాన్ని వణికిస్తున్న ఒక పెద్ద సమస్య... గణాంకాలని స్థూలంగా పరిశీలిస్తే ఈ మహమ్మారి ప్రభావిత రాష్ట్రాల జాబితాలో మనది ఐదవ స్థానం...కాస్తా లోతుగా పరిశీలిస్తే ఇది 90% లైంగికంగా, 4% తల్లి నుంచి బిడ్డలకు వ్యాప్తి చెందుతుండగా...కలుషిత రక్తమార్పిడి, సిరంజులు వంటివి ఇతర కారకాలు.

పైన పేర్కొన్న వ్యాప్తి కారకాలను చూస్తే, రెందు విషయాలు సుస్పష్టం:

1. ఇది లైంగికంగానె కాకుంద ఇతరత్రా కారణాలు వలన కూడా వ్యాపిస్తుంది..

2. మరి కాస్తా నిశితంగా చూస్తే ఇది కొంతమేర ఒక విషవలయంగా కనిపించకమానదు.!!! అంటే ఎయిడ్స్ బారిన పడ్డ వారినుంచి వారి జీవిత భాగస్వామికి ఆపైన వారికి పుట్టబోయే పిల్లలకి సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువ..

అంతే ఈ వలయాన్ని చేధించవలసిన అవసరం ఎంతైన ఉన్నది అన్నది చాలా స్పష్టం...ఆ చేధనలో మన తరానిదే కీలక భూమిక అన్నది కాదనలేని వాస్తవం......వివాహానికి ముందు, కాబోయే జీవిత భాగస్వాములు ఇద్దరు హెచ్.ఐ.వి. పరీక్షలు చెయించుకొవడం ద్వారా తమ ప్రాణాలు నిలుపుకొనేవారు లేదా ఇంకొకరికి ప్రాణదానం చేసినవారు అవ్వవచ్చు .....మన సామజిక వ్యవస్తలో ఇది కాస్తా కష్టంతో కూడుకున్న పని అందుకే రండి నిశ్శబ్ధాన్ని ఛేదిద్దాం...మన జీవితాలలో విజేతలుగ నిలుద్దాం...ఎందుకంటే ఎయిడ్స్ కేవలం పులిరాజాలకు మాత్రమే రాదు

దేశమంటే మట్టికాదోయ్..దేశమంటే ఆరొగ్యకరమయిన మనుషులోయ్

Wednesday 10 February 2010

రోజు లాగానె దినపత్రిక తిరగెస్తుంటే ఈ వారంలో ఒకే వ్యక్తి గురించి వచ్చిన రెండు వేరువేరు విషయాలు నన్ను కాస్త సంభ్రమాశ్చర్యాలకు ఆనందానికి గురిచేసాయి ......

కాస్తా (క్లుప్తంగా) ఆ వివరాలలొకి వెళ్తే .... ఆ వ్యక్తి వేరెవరొ కాదు ....రాష్ట్రానికి వచ్చిన మొదటిరోజు నుంచి తనదైన శైలిలొ వ్యవహరిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్న మన రాష్ట్ర ప్రధమ పౌరుడు శ్రీ నరసింహన్ గారు....

రాష్ట్ర ప్రధమ పౌరుడు ఆ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు కులపతి (చాన్సలర్).....ఈ వారంలొ జరిగిన అన్ని విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశంలో తనదైన వ్యవహారశైలితో అధికారగణంకి దిశానిర్దేశం చెసి, వారి గుండెలలొ రైల్లు పరిగెత్తించి రాజ్ భవన్ లోపలేకాని బయటేకాని తాను రబ్బర్ స్టాంప్ ని కాదు అని నిరూపించారు..

కంటినొప్పి, పంటినొప్పికి సైతం ఐతే ఇక్కడి కార్పొరేట్ హాస్పిటల్ కి లేకపొతే విదేశాలకి పరిగెత్తే ప్రముఖులకి భిన్నంగా మన గవర్నర్ గాంధీ ఆసుపత్రిలొ ఒక చిన్నపాటి శస్త్ర్రచికిత్స చేయించుకోవడం నిజంగా అబ్బురపరిచిన విషయం......కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని తమ అవసరాలకు సొంత డబ్బులాగ ఖర్చుపెట్టే రాజకీయనాయకులకు ఇది కాస్తా కనువిప్పు కలిగిస్తుంది అని ఆశిద్దాం...

ఒక విద్యావేత్త, సమర్ధుడు, నిజాయితిపరుడైన వ్యక్తి ఒక రాజ్యాంగపరమైన ఉన్నతస్థానం అలంకరిస్తే, ఆ పదవికి ఎంత వన్నె వస్తుందొ అన్నది తెలుసుకోవడానికి ఇది కేవలం మచ్చుతునక .....అలాంటి వారందరికి నా పాదభివందనాలు. బహుశా మన పాలకులు ఇట్లాంటి విషయాలలొనైనా కాస్తా రాజకీయాలకు అతీతంగా నిర్ణయాలు తీసుకుంటుంటే మనకు చాలా మేలు చెసిన వారు అవుతారు ....

Friday 5 February 2010

ఒక చిన్నమాట

నిత్యం మన చుట్టూ జరిగే చాలా విషయాలు మనల్ని చాలా ఆలొచింప చేస్తాయి ....అది మంచైనా సరే లేక చెడైనా సరే .... చిన్నదైనా సరే లేక పెద్దదైనా సరే ....

మన చుట్టూ జరుగుతున్న సంఘటనల గురించి నా అభిప్రాయాలును/ఆలోచనలను/నాలొని సంఘర్షణని నా తోటి వారితో పంచుకొవడనికి బ్లాగ్ ని ఒక మాధ్యమంగా వాడుకోదలిచాను.

ఇవి కేవలం నా అభిప్రాయాలు మాత్రమే....మీ సలహాలు సదా స్వీకరించబడును. మీ అభిప్రాయాలు నిష్కర్షగా చెప్పుటకు వెనకడుగు వేయవద్దని మనవి.